

జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన సమతులగుండం , భీమన్ గొంది గ్రామాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ,ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తో కలసి ద్విచక్ర వాహనం పై వెళ్లి గ్రామాన్ని సందర్శించారు. సమతులగుండం గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో మూడు నమ్మకాల భయంతో ఏ గ్రామాన్ని వదిలి భీమన్గొంది గ్రామానికి వెళ్లి నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలను ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించి వివరాలను అడిగితీసుకున్నారు..
మూఢనమ్మకాల పై అవగాహన కల్పించారు అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు
మళ్లీ సమతుల గుండం గ్రామానికి రావాలని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.. మూడ నమ్మకాలను వీడాలన్నారు. మీకు అండగా ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పోలీసులు ప్రజా సేవలు చేయడంలో ముందుంటారని ఆదివాసి గిరిజనులకు తెలియజేశారు.
ప్రస్తుతం ఆ గ్రామంలో ఒకటే కుటుంబం నివసిస్తుంది వారికి అవసరమైన నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు మూడ నమ్మకాలను వీడాలన్నారు. గ్రామస్తులు తమకి రేషన్ కార్డు లేదని పింఛన్ రావడం లేదని ఏఎస్పీ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

