Listen to this article

రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 22 :

ఏన్కూరు గురుకుల కళాశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో తీర్థం శ్రీ వెంకట ఆంజనేయ 468/470,ద్వితీయ సంవత్సరం ఎంపీసీ ఈ భాగంలో ఎస్ మహేష్ 995 /1000 మార్కులతో ఇరువురు రాష్ట్రస్థాయి ర్యాంకులు పొందారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 43 మందికి 43 మంది ఉత్తీర్ణులైనారు. వీరిలో హృతిక్ కుమార్ 467, జి కళ్యాణ్ 466 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 40 మందికి గాను 39 మంది ఉత్తీర్ణులైనారు. వీరిలో కె రోహిత్ 993, జి వెంకటేష్ 988 మార్కులు పొందారు. ద్వితీయ సంవత్సరం బైపిసి లో 21 మంది గాను 21 మంది ఉత్తీర్ణులైనారు. కే గోవర్ధన్ 988, కే సిద్ధార్థ 987, ప్రథమ సంవత్సరం బైపిసి లో 34 మంది గాను 33 మంది ఉత్తీర్ణులు అయినారు. వీరిలో డి రాఘవేంద్ర ఎస్ హరీష్ లు 430, కే నాగ వెంకట్, లిఖిల్ 429 మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ తుడి శ్రీనివాసరెడ్డి, కళాశాల లెక్చరర్లు,ఉపాధ్యాయులు అభినందించారు.