

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 24 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ను సైబరు సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో ట్రేస్
చేసిన సుమారు రూ.42.85 లక్షల విలువైన 264 మొబైల్స్ ను తిరిగి బాధితులకు ఏప్రిల్ 23న అందజేసామని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ ను పోగొట్టుకున్న
బాధితులు ఇకపై విజయనగరం పట్టణంలోని సైబరు సెల్ కార్యాలయంకు రావాల్సిన అవసరం లేదని, తమకు దగ్గరలోని పోలీసు స్టేషన్ను సంప్రదించి, మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోనులను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ‘మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ను ఏర్పాటు చేసామన్నారు. ఈ విధానంతో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు విజయనగరం పట్టణంలోని సైబరు సెల్ కార్యాలయంకు రావాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు తమకు దగ్గరలోని పోలీసు స్టేషను సంప్రదించి, పోగొట్టుకున్న మొబైల్స్ వివరాలను అందించినట్లయితే, వారు సదరు ఫిర్యాదును ‘మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ద్వారా పోయిన మొబైల్ను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లా ప్రజలకు పోలీసు సేవలను మరింత సులభతరం చేసేందుకు 8977945606 మొబైల్ నంబరును కూడా ఏర్పాటు చేసామని, ఆ మొబైల్ నంబరుకు ‘హాయ్’ అన్న సందేశాన్ని పంపితే, వారు పంపిన మొబైల్కు ఒక గూగుల్ ఫారం వస్తుందన్నారు. ఈ గూగుల్ ఫారంను పూర్తి చేసి, తిరిగి 8977945606 పంపినట్లయితే, ఫిర్యాదును నమోదు చేసుకొని, పోయిన మొబైల్ ను ట్రేస్ చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.6కోట్ల విలువైన 3,300 మొబైల్ ఫోన్లును ట్రాక్ చేసి, బాధితులకు అందజేసామన్నారు. అదే విధంగా ప్రస్తుతం మరో 264 మొబైల్ ఫోనులను సైబరు సెల్ పోలీసులు, సిబ్బంది నిరంతరం
శ్రమించి, ట్రాక్ చేయడం జరిగిందన్నారు. దొరికిన మొబైల్స్ ను లేదా రశీదులు లేకుండా గుర్తు తెలియని వ్యక్తుల నుండి మొబైల్స్ ను కొనుగోలు చేయడం మంచిది కాదని, వాటి వలన చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చున్నారు. కావున, ఎవరికైనా మొబైల్ దొరికితే వాటిని స్థానిక పోలీసు స్టేషనుకు ప్పగించాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్పీ నకుల్ జిందల్ కోరారు. అనంతరం, ట్రేస్ చేసిన 264 మొబైల్స్న బాధితులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అందజేసారు. బాధితులకు అందజేసిన వాటిలో 20 సాంనన్ మొబైల్స్, 93 – వివో, 30 – ఒప్పో, 45 – రియల్ మీ, 29 – రెడ్ మీ, 15 – పోకో, 10 – వన్ ప్లస్, 10 – ఐక్యూ, 3 – మోటోరోలా, 4 – ఇనిఫినిక్స్, 2 – నథింగ్, 2 – టెక్నో స్పార్క్, 1 – లావా బ్లేజ్ మొబైల్ ఉందని, మొత్తం 264మొబైల్స్ విలువ రూ. 42.85 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. పొగొట్టుకున్న మొబైల్స్ తక్కువ వ్యవధిలోనే తిరిగి తమకు అప్పగించిన సైబర్ సెల్ పోలీసులకు, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గార్కి బాధితులు కృతజ్ఞతలు తెలిపి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సైబరు సెల్ సిఐ బి. శ్రీనివాసరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, సైబరు సెల్ ఎస్ఐ నజీమా బేగం, సైబర్ సెల్ సిబ్బంది శ్రీనివాసరావు, వాసుదేవ్, తిరుపతి నాయుడు, రాజేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.