

జనం న్యూస్ ;26 ఏప్రిల్ శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ :సిద్ధిపేట సిటిజన్స్ క్లబ్ లో ఈరోజు పేరిణినృత్యం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు తెలంగాణ కీర్తికిరీటం పేరిణి ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు రమేష్ లాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథి మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు ప్రారంభించి, పేరిణినృత్యం ఆర్ట్స్ అకాడమీ స్థాపించి 50 సంవత్సరాల ఉత్సవాలు జరగడం సంతోషకరమన్నారు, సిద్దిపేట కళలకు నిలయమని పేరిణి శివతాండవం అందరూ నేర్చుకోవాలని 42 వార్డు కౌన్సిలర్ సభాధ్యక్షులు కాటo శోభారాణి రఘురాo అన్నారు. ఈ అకాడమీ ద్వారా వేలమంది దేశ విదేశాలలో పేరిణినృత్యం నేర్చుకున్నారని ఈ కళ మరుగున పడకుండా సజీవంగా ఉండాలని శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు పెందోటి వెంకటేశ్వర్లు అన్నారు. సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్లో చదివిన రమేష్ లాల్ తన చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు, అటు సిద్దిపేటకు తెలంగాణకే కాదు దేశానికి ప్రతిష్టతెచ్చారని ఆత్మీయ అతిథి గడ్డం బాలకిషన్ గజిటెడ్ హెడ్మాస్టర్(రి) కొనియాడారు. పేరిణి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు పేరిణి రమేష్ లాల్ మాట్లాడుతూ తాను నటరాజ రామకృష్ణ గురువు వద్ద పేరిణి నృత్యం నేర్చుకున్నానని, 48 గంటల పేరిణి నృత్యంతో ప్రపంచ రికార్డును సృష్టించినానని, దానిని ఇంతవరకు ఎవరు అధిగమించ లేదని కూడా తెలిపారు. సిటిజన్స్ క్లబ్ అధ్యక్షులు, ప్రధానకార్యదర్శిలు చక్కటి ప్రతిభతో నాట్య ప్రదర్శన అందించిన చిన్నారులు- నయన, కృత్తిక, వైష్ణవి, ప్రణీతలను జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అంజయ్య, ప్రముఖనృత్య కళాకారిణి భవాని, కళాభిమానులు, సిటిజన్స్ క్లబ్ సభ్యులు, పురప్రముఖులు మొదలైన వారందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.