

జనం న్యూస్ ఏప్రిల్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; జమ్మూ కాశ్మీర్లో పహళ్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్, మార్కెట్ యార్డ్ వాకర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ పహల్గాంలో 26 మంది పర్యాటకులను పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లస్కర్ తోయిబా సంస్థ ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా పెట్టుకుని అతి కిరాతకంగా కాల్చి చంపడం దారుణమైన చర్యని సత్యనారాయణ అన్నారు. భారతదేశానికి ప్రపంచ దేశాల మద్దతు తెలపడం అభినందనీయమని, ఉగ్రవాదం అణిచివేయడంలో తమ వంతు సహకారం అందిస్తామని ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా ముందుకు వచ్చాయని, ఇది ఉగ్రవాది చర్యలు అణచివేసే దిశగా భారత్ కు శుభ పరిణామని సత్యనారాయణ అన్నారు. చర్యలు జరిగిన వెంటనే భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటన రద్దు చేసుకొని హఠాత్తుగా దేశానికి వచ్చి ఉగ్రవాదం అణ చివేయడానికి ఆర్మీ నేవీ రక్షణ శాఖలతో సమావేశం ఏర్పాటు చేసి, వారికి ప్రభుత్వ చర్యలను తెలియజేసి, అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ విధానాన్ని తెలియజేసి అందరి మద్దతును పొందడం కూడా దేశం అంతా ఒకే మాటపై ఒకే బాటపై ఉంచే విధంగా ప్రధాన మోడీ రక్షణ శాఖ మాత్యులు రాజనాథ్ సింగ్ చర్యలు హర్షనీయమని సత్యనారాయణ అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ ప్రతినిధి డాక్టర్ డి డి నాయుడు మాట్లాడుతూ హిందువులంతా జరిగిన సంఘటనపై విచారణ వ్యక్తపరిచారని, తీవ్రంగా ఖండించారని హిందూ సమాజం ఐక్యమత్యంగా ఉండి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ముందుకు రావాలని నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల గంగరాజు బొడ్డేడ మోహన్ కాండ్రేగుల వెంకట సూరి కాండ్రేగుల నూక రామలింగ స్వామి కొణతాల ఆది నాగేశ్వరరావు కాండ్రేగుల ఆదిబాబు, కైచర్ల చిన్న ప్రింటింగ్ ప్రెస్ కుమార్ మద్దాల దిలీప్ శిలపరిశెట్టి శ్రీనివాసరావు శిలపరిశెట్టి భాస్కరరావు బొడ్డేడ భాస్కరరావు ఉపాధ్యాయులు కొణతాల రాజేంద్రప్రసాద్ బీసెట్టి కన్నారావు గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శ్రీనివాసరావు పెతకంశెట్టి శ్రీనివాసరావు కర్రి శివ చదరం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.//