Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఎన్నికలకు ముందు కూటమి పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తరఫున ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు బాసటగా నిలుస్తున్నారని, సముద్రాన్ని నమ్ముకున్నా మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి కోసం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకానికి గంగ పుత్రులు వేట నిషేధకాల భృతి పంపిణీ 258 కోట్లు నేరుగా లబ్ధిదారులు ఖాతాలో 20000 చొప్పున జమ చేస్తున్నారని మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు జగన్ రెడ్డి గల్లాపెట్టి కాళీ చేసినప్పటికీ తనకున్న మేధాశక్తితో తో పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తూ, సమాంతరంగా సంక్షేమ కార్యక్రమాల్ని ఇతోదికమైన నిధులు విడుదల చేస్తూ బడుగు బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకుంటున్నారని నాగ జగదీష్ అన్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు రెండు నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలములో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతి 10,000 నుండి 20000 కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దార్షినికుడు నారా చంద్రబాబునాయుడు అని నాగ జగదీష్ అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,29,178 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున ప్రతి నెల 68,396 కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నారని, చేపల వేట సమయంలో మరణిస్తే 10 లక్షల పరిహారం చెల్లిస్తున్నారని, ఇప్పటికే మరణించిన 63 మంది కుటుంబాలకు సాయం అందించారని, త్వరలో మరో 80 కుటుంబాలకు 8 కోట్లు నిధులు కేటాయించారని, వేటకు వెళ్లే పడవలకు 3000 లీటర్లు మోటార్ బోట్లకు 300 లీటర్ల చొప్పున సబ్సిడీగా డీజీలకు తొమ్మిది రూపాయలు చెల్లిస్తున్నారని నాగ జగదీష్ అన్నా