

జనం న్యూస్ ఏప్రిల్ 26 ముమ్మిడివరం ప్రతినిధి [ఇటీవల కాశ్మీర్ లో హిందువులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ… ఉగ్ర దాడిలో మృతుల ఆత్మలు శాంతించాలని కోరుతూ… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తాటిపాక సెంటర్లో శుక్రవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ కంచర్ల బాబి, కోశాధికారి శ్రీ కంచర్ల కృష్ణ మోహన్, ఉపాధ్యక్షుడు శ్రీ పోశెట్టి సూరిబాబు, అదనపు కార్యదర్శి శ్రీ కాసు శ్రీనివాసు, వాణిజ్య విభాగం చైర్మన్ శ్రీ లక్కింశెట్టి బాబులు, శ్రీ లక్కింశెట్టి నానాజీ, శ్రీ లక్కింశెట్టి రతన్ బాబు, శ్రీ యెండూరి రమేష్, శ్రీ తుమ్మలపల్లి సురేష్, శ్రీ వాసు, శ్రీ కంచర్ల ప్రణీత్ గణేష్, శ్రీ జమిందార్, శ్రీ లక్కింశెట్టి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.