Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 26 ముమ్మిడివరం ప్రతినిధి : జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ కంచర్ల బాబి పేర్కొన్నారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మరణించడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రధాన మోడీ వారి నేతృత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ఇటువంటి సమయంలో మనం ఎదుగుదలను ఓర్వలేని కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయాన్నిస్తూ ఇటువంటి దాడులకు తెగబడుతున్నాయని తెలిపారు.