

జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా శుక్రవారం విజయనగరంలో నూరుల్ ముస్తఫా మస్టిద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ డౌన్ డౌన్, హిందూ ముస్లిం బాయి బాయి అంటూ నినాదాలు చేశారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టేలా టెర్రిస్టులు దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు. మరణించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారని దాడులకు పాల్పడిన వారికి భారత ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్పాలని కోరారు.