Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)


కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గా, రెండవ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహించి వారి యొక్క స్థాన బదిలీల పై వెళ్తున్న పాలడుగుల అలేఖ్య, గేదెం స్వాతి, కి మర్యాద పూర్వకంగా బార్ అసోసియేషన్ హుజురాబాద్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారి ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. వారిని ఘనంగా సన్మానించారు. ఇట్టి సమావేశానికి సీనియర్ సివిల్ జడ్జి పి.బి. కిరణ్ కుమార్ మొదటి అదనపు మేజిస్ట్రేట్ పద్మ సాయి , హాజరైనారు. ఈ సందర్బంగా పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న అలేఖ్య , స్వాతి, వారి యొక్క సేవలకు గాను హుజురాబాద్ ప్రజలు బార్ అసోసియేషన్ హుజురాబాద్ సభ్యులు ఎల్లవేళల వారికి ఋణపడి ఉంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ హుజురాబాద్ నూతన అధ్యక్షుడు యతిపతి అరున్ కుమార్, జనరల్ సెక్రటరీ ఎర్రోళ్ల రమేష్, ఉపాధ్యక్షుడు నూతాల శ్రీనివాస్,లేడీ ఈ సి, శిరీష, లైబ్రెరీ సెక్రటరీ చౌడమల్ల భానుకిరణ్ సీనియర్ న్యాయవాదులు కేసరి శిష్య, భగవాన్ రెడ్డి, విజయ రెడ్డి, వీరసేన రెడ్డి, సమ్మీ రెడ్డి, భూమి రెడ్డి, జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,