Listen to this article

వరంగల్లో గులాబీ జాతర

జనం న్యూస్ ఏప్రిల్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బి ఆర్ ఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తదనంతరం వరంగల్ లో జరిగే గులాబీ జాతరకు బయలుదేరి వెళ్లారు బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు మాయదారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందోనని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోతున్నారని పేర్కొన్నారు పదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ఆత్మగౌరవంతో బతికారని కెసిఆర్ గత 10 సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని మళ్లీ ప్రజలు కేసిఆర్ పాలన కోరుతున్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ అధికారంలోకి తీసుకురావడం ఖాయమని పేర్కొన్నారు బి ఆర్ ఎస్ 25వ సిల్వర్ జూబ్లీ వేడుకకు దేశ చరిత్రలోనే పెద్ద సభ అని తెలిపారు అభిమానులు ఊరువాడ ఉప్పెనల కదిలి రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి జగన్ రెడ్డి విజయ్ కుమార్ గోపాల్ రాజ్ కుమార్ నర్సింహారెడ్డి మల్లేశం నాగయ్య తదితరులు పాల్గొన్నారు