Listen to this article

జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాం లో మంగళవారం 22/04/2025 వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడిని విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ మరియు ఆర్కే అకాడమీ తీవ్రంగా ఖండిస్తుంది .అదేవిధంగా ఈ రోజు అనగా 25/04/2025 వ తేదీ సాయంత్రం 06:00 గంటలకు సంతకాల వంతెన నుండి బాలాజీ జంక్షన్ వరకు లో కోవత్తులు వెలిగించి శ్రద్దాంజలి ఘటించటం జరిగింది.ప్రశాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టించి తద్వారా భారత దేశాన్ని విచ్చిన్నము చేయాలి అనే దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు .అమాయకులైన ప్రజలను ఉగ్రదాడిలో పొట్టన పెట్టుకోవడం చాలా బాధాకరం.క్రొత్తగా పెండ్లి చేసుకుని,విహారయాత్రకు వెళ్లిన నావల్ అధికారి వినయ్ నర్వాల్ ను కూడా హతమార్చాడం మనసును కలచివేసింది.అదేవిధంగా నెల్లురు జిల్లా కావలి కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వంట్లో నలభై బులెట్స్ దిగేవిదంగా నిరాయుదులపై కాల్పలు జరపడం అత్యంత శోచనీయం.మన సైనికులు తోందరలోనె ఆ ఉగ్రవాదులను మరియు వారి మూలాలను సైతం అంతమొందిస్తారనటములొ సందేహం లేదు.ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ కుమార్ (రిటైర్డ్ – ఎన్. ఎస్. జి. బ్లాక్ క్యాట్ కమాండో) ప్రభుత్వానికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారూ. కార్యక్రమంలో రమేష్ బాబు గారు, డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ శంకర్ (ఆర్ కె అకాడమీ) సొంగ మనోజ్ కుమార్, నాగేశ్వరరావు గారు, బూరెలు పైడిరాజు మరియు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..