

సిపిఐ విజయనగరం నగర కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జమ్మూకశ్మీర్లో పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతావనిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తెల్లటి మంచు కొండల్ని ఎర్రటిరక్త ప్రవాహంలో ముంచింది. పచ్చని పర్వతాల మధ్య విహరిస్తున్న అమాయిక భారతీయ పర్యాటకులపై ముష్కర ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల వలన దేశంలో మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 28 మంది తమ విలువైన ప్రాణాల్ని కోల్పోయారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ముష్కర ఉగ్రవాద మూకలు దాడులుకు – దేశంలో మోడీ ప్రభుత్వ భద్రతా నిర్లక్ష్యానికి బలైపోయిన భారతీయలకి సిపిఐ అశ్రునివాళి అర్పిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) విజయనగరం నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్.బి.ఐ మెయిన్ బ్రాంచి దగ్గర ఉన్న గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ భారత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన టెర్రరిస్టుల తూటాలకు బలై భర్తలను, తండ్రులను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి భాద్యతగా ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకు పనిపించేవరకు ఉండకుండా, మృతులకి దహన సంస్కారాలు కూడా పూర్తి కాకుండా విశ్వగురువు మోడీ గారు బీహారులో జరగబోయే ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళడం కరెక్టే అంటారా మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలికే వాళ్ళే సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. చాయ్ అమ్ముకొనే స్థాయి నుండి ప్రధాన మంత్రిగా హిందువుల ఓట్లతో 11 సంవత్సరాల నుండి ప్రధానిగా ఉన్న మోడీ హయాంలోనే సుమారు 27 సార్లు ఉగ్రవాద దాడులు, హైజక్ లు, బాంబు పేలుళ్ళు జరిగాయి అన్నారు. జరగుతున్న మారణఖాండలో భారతీయ జవాన్లు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ప్రాణాలు పోయాక సర్జికల్ స్ట్రైక్ లు జరుపుతారు కానీ దాడులు జరగకుండా కఠినమైన భద్రత చర్యలు చేపట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు మోడీగారు అని మండిపడ్డారు. ఏదోక రాష్ట్రంలో ఎన్నికల ముందు మాత్రమే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి దీనికి ఎవరు భాధ్యత వహించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇలాంటి శవ రాజకీయాలు చేస్తున్నారు కానీ దేశభక్తి కాదు అని విమర్శించారు. దేశం బోర్డర్ దాటుకుని ఉగ్రవాదులు ఎలా రాగలుగుతున్నారు.? తుపాకులు బాంబులు ఎలా వస్తున్నాయి.? దేశ భద్రత వ్యవస్థలు అన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కదా పని చేస్తున్నప్పుడు దేశ బోర్డరల్లో అదే విధంగా సుమారు 4000 వేల మంది పర్యాటకులు ఉండే ఇలాంటి ప్రాంతాల్లో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు.? దేశంలో ఖాళీగా ఉన్న 1లక్షా 80 వేల ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదు.? ఈ ప్రశ్నలన్నిటికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దేశ ప్రజలకి సమాధానం చెప్పగలరా మోడీ గారూ అని దుయ్యబట్టారు. ఆర్మీ రిక్రూట్మెంట్ చేయకుండా డబ్బులు మిగిలించుకుని ఆ డబ్బులతో ఎన్నికల్లో గెలవడానికి భారతీయ జవాన్ల, ప్రజల ప్రాణాలతో శవ రాజకీయాలు చేస్తారా మోడీ గారు అని మండిపడ్డారు. సశాస్యమలమైన భారతదేశంలోకి చొరబడుతున్న ముష్కర ఉగ్రవాద మూకలు, దేశంలో పతుకుపోయిన మతోన్మాదులు ఇద్దరూ కలిసి భారత దేశాన్ని నాశనం చేస్తున్నారని అశోక్ ధ్వజమెత్తారు. ఉగ్రవాదమూ.. మతోన్మాదమూ సమ్ములంగా నాశనం అయితేనే భారత దేశం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతుందని అదే లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) పోరాటాలు కొనసాగుతుందని బుగత అశోక్ స్పష్టం చేశారు. నాడు పుల్వామా, నేడు పహాల్గాం బాధితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సమితి నాయకులు ఎస్. రంగరాజు, బూర వాసు, పొందూరు అప్పలరాజు, పొడుగు రామకృష్ణ, మద్దుల సూరిడమ్మ, విశాలాంధ్ర బుక్ హౌస్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇబ్రహీం మరియు కార్మికులు పాల్గొన్నారు.