Listen to this article

జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జమ్ము కాశ్మీర్‌లో ని పహల్లామ్‌లో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రతా దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయనగరం పట్టణంలోని రద్దీ ప్రదేశాలైన ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ , లాడ్జ్‌లు, రైతు బజార్లు, మార్కెట్లు, తదితర ప్రదేశాల్లో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్‌ స్క్వాడ్‌, మెటల్‌ డిటెక్టర్‌ బృందాలతో అణువణువునా గాలించారు.