

జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జమ్ము కాశ్మీర్లో ని పహల్లామ్లో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రతా దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయనగరం పట్టణంలోని రద్దీ ప్రదేశాలైన ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, మల్టీప్లెక్స్ థియేటర్స్ , లాడ్జ్లు, రైతు బజార్లు, మార్కెట్లు, తదితర ప్రదేశాల్లో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్ బృందాలతో అణువణువునా గాలించారు.