

జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జాతి, మత విద్వేషాలను మరచి భారతీయులమంతా ఐక్యంగా కలిసి ఉందామని సూఫీ మార్గ నిర్దేశి డాక్టర్ ఎండీ ఖాదరీ బాబు పిలుపునిచ్చారు. పహల్లావ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బాబామెట్ట లోని ఖాదర్ బాబా దర్గాలో స్థానిక ముస్లీం పెద్దలు, సోదరులు ఉగ్ర దాడిని ఖండిస్తూ నిరసన తెలియచేశారు. పాక్ ముష్కరులు చేసిన మారణ హోమం ప్రతీ భారతీయున్ని తీవ్రంగా కలచి వేసిందన్నారు. సాటి మనిషికి సాయం చేస్తూ మానవత్వాన్ని బ్రతికించాలన్నారు.