

జనం న్యూస్ ఏప్రిల్ 27 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)
కీబోర్డ్ ప్రదర్శనలో మండలంలోని దొంతికూరుకు చెందిన ఓ మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ధ్రువపత్రం అందుకున్నారు విజయవాడలో హలేల్ సంగీత పాఠశాల ఆధ్వర్యంలో గత ఏడాది ఆన్లైన్ వేదికగా నిర్వహించిన ప్రపంచ స్థాయి కీబోర్డు సంగీత ప్రదర్శనలో దొంతి కుర్రు కు చెందిన సంసాని దివ్య స్వరూప పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలకు చెందిన 1046 మంది పాల్గొని కీబోర్డ్ లో తమ ప్రతిభ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డులో చోటు దక్కడంతో పాల్గొన్న భాగస్వాములు అందరికీ గిన్నిస్ ధ్రువపత్రాలు వచ్చాయి. విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హలేలు సంగీత పాఠశాల ప్రతినిధులు దివ్య స్వరూప కు గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ను అందించారు. మండలం తరపున గిన్నిస్ రికార్డు లో భాగస్వామ్యులై సర్టిఫికెట్ పొందిన ఆమెను పలువురు అభినందించారు