Listen to this article

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాదు. రూరల్ ప్రంతంలోని.ధర్పల్లి గ్రామంలో ఉపాధి కూలీల పని క్షేత్రంలో కూలీలతో కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది రాబోయే రోజుల్లో ఉపాధి పనులను క్రమేనం నిలిపి వేసేందుకు కుట్ర పన్నుతుంది గత బడ్జెట్లో కోత పెట్టింది ఉపాధి కూలీలకు సంవత్సర కాలంలో 200 రోజులు పని కల్పించి ఉపాధి యాక్ట్ ప్రకారం పని క్షేత్రంలో నీడ కోసం టెంట్ త్రాగునీరు వసతి మెడికల్ కిట్టు ఓఆర్ఎస్ పాకెట్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.వంద రోజులు పని కల్పించాల్సింది ఉండగా కేవలం 60 రోజుల లోపే పని కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో 300 కూలి ఉంటే ఈ సంవత్సరం కేవలం ఏడు రూపాయలు మాత్రమే కూలీ పెంచింది నిత్యవసర ధరలు ఆకాశానికి అంటుతున్న తరుణంలో పెంచిన కూలి ఏ మాత్రం సరిపోవడం లేదు. కూలీలకు పనిముట్లు గడ్డపార పారా గమల ఇవ్వడం లేదు గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలో కలపడం వలన ఉపాధి పని ని ప్రజలు కోల్పోతున్నారు, పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఉపాధి పని కల్పించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన ఉపాధి కూలీలకు ఉపాధి హామీ జాబు కార్డు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పనిచేసిన ఉపాధి కూలీలకు గత 12 వారాల నుంచి డబ్బులు ఖాతాలో జమ చేయకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయి పడ్డ డబ్బుల్ని ఉపాధి కూలీల ఖాతాలో వెంటనే జమ చేసి వారిని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. 300 రూపాయలు ఉన్న కూలి 600 రూపాయలకు పెంచి ప్రజలను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా గత మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆధ్వానంగా తయారవుతావుంది, ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య, ఉషాన్న, సిపిఎం మండల నాయకులు గడ్డం మోహన్, తదితరులు పాల్గొన్నారు.