

జనం న్యూస్ ఏప్రిల్ 27 (ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
యుటిఎఫ్ కాట్రేనికోన మండల శాఖ ఆధ్వర్యంలో ఎస్ .ఎస్. సి -25 పరీక్షా ఫలితాలలో అత్యంత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ మార్కులు సాధించిన పలు పాఠశాలల విద్యార్థులు కాట్రేనికోన మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జడ్.పి.హెచ్.ఎస్ కందికుప్ప హై స్కూల్ నుండి చి. బడుగు శ్రీ రక్షిత (582/600) ను,
జెడ్ పి హెచ్. ఎస్. గచ్చకాయల పొర హైస్కూల్ నుండి చి. కలాడి మైథిలి(576/600)ను , జెడ్ పి హెచ్ ఎస్. ప్లస్ కాట్రేనికోన నుండి చి. గుబ్బల రేవతి (573/600) వారినీ ఇంటి వద్ద కలిసి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడమైనది.. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులను, తీర్చిదిద్దిన పాఠశాల ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించడంతో పాటు విద్యార్దులను వారి తల్లిదండ్రులకు చిరు సత్కారం గావించడం అయినది. అదేవిధంగా విద్యార్థులు ఇదే స్ఫూర్తితో మంచి క్రమశిక్షణతో ఉన్నతమైన చదువులు చదివి భవిష్యత్తులో మరిన్ని విజయాలనందుకోవాలని తద్వారా మంచి అభివృద్ధిలోకి రావాలని మండల శాఖ కార్యకర్తలు, ఉపాధ్యాయులు అందరూ ఆకాంక్షిస్తూ హృదయపూర్వకంగా ఆశీర్వదించి అభినందించడమైనది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ కాట్రేనికోన మండల శాఖ అధ్యక్షులు ఎమ్ .కె . పేరి శెట్టి, ప్రధాన కార్యదర్శి ఎం.డి. అబ్దుల్ సత్తార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్.గోపాలకృష్ణ,అసోసియేట్ అధ్యక్షులు పి. ఏడుకొండలు, కోశాధికారి బి. ఎస్. న్ . మూర్తి, కె .రేణుక ప్రసాద్,జి. పెద్దిరాజు, వి యు.ఎస్. సాగర్, ఎస్. కె.మస్తాన్ బాబా, పి. జగన్ సి హెచ్. రాంబాబు, బి. సతీష్, బి.బి.. అనంతలక్ష్మి, పి .రమేష్,వి. శ్రీనివాసరావు, బి. సత్యానంద రాజు, వి. వీరభద్రరావు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
