

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల నమోదు కార్యక్రమం. స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నాగిరెడ్డిపల్లి నందు జరిగిన కార్యక్రమంలో నందలూరు మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని మండల విద్యాశాఖ అధికారులు ఎల్ నాగయ్య మరియు సి ఆర్ అనంతకృష్ణ తెలియజేశారు. మండల ప్రథమ స్థానంలో టి. మణిదీప్ 589 మార్కులు ( జడ్.పి.హెచ్.ఎస్ పాటూరు), 2రెండవ స్థానంలో కె వెంకట శైలజ 579 మార్కులు( ఎం జె పి బి సి వెల్ఫేర్ స్కూల్),మూడో స్థానంలో ఎం షణ్ముఖ శ్రీనివాస్ 578 మార్కులు (జడ్పీహెచ్ఎస్ పాటూరు) సాధించారు. మండలంలోని ప్రభుత్వ హైస్కూల్ అన్నింటిలో కలిపి దాదాపుగా 20 మంది విద్యార్థులు 500 కు పైగా మార్పులు సాధించారు.అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తల్లిదండ్రులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తి గా ఉచితంగా విద్యను పొందవచ్చని అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం నిరంతరం కృషి చేస్తుందని, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఎల్లవేళలా మా ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందని మండల ప్రజలందరికీ తెలియ జేస్తున్నాం. మీ పిల్లలందరినీ ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి చదివించుకోవాలని ప్రజలందరినీ కోరు చున్నామనీ మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. మండల విద్యాశాఖ అధికారులు మరియు మండల ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం గ్రామంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జనరల్ సెక్రెటరీ లీలా కృష్ణయ్య, ప్రెసిడెంట్ షఫీ ఉల్లా, మహేశ్వర బాబు, సంజీవ ప్రసాద్, అశోక్ కుమార్, రమేష్ బాబు, కృపానందం, లక్ష్మీ రాజ్యం, లక్ష్మీకాంతమ్మ, గాయత్రీ దేవి,సందాని తదితర మండల ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.