Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 28 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

ఆగిఉన్న లారీని కారు వెనక నుండి ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలైన, సంఘటన మునగాల మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి 65 పై శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పొనగండ్ల జ్యోతి (49), కోదాడ పట్టణంలో షిరిడి సాయి నగర్ లో కిరాయికి ఉంటున్నారు. హైదరాబాదులోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి కోదాడ కు వస్తుండగా మార్గం మధ్యలో మునగాల మండల కేంద్రంలో ఆగి ఉన్న లారీని కారు వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా అల్లుడు నరేందర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి భర్త రామ్ రెడ్డి ఫిర్యాదు మేరకు మునగాల ఏఎస్ఐ వెంకటరత్నం కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.