Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ,డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చందు తో కలిసి, సోమవారం ఉదయం వీణవంక మరియు చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టిక మరియు రికార్డులను పరిశీలించడం జరిగింది. ఇన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న పేషంట్లతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అదేవిధంగా ఫార్మసీ స్టోర్ లోని వేసవి కాలానికి సంబంధించి మందుల నిల్వలను, కుక్క కాటు మందులను పరిశీలించారు. లేబరేటరీ మరియు ఎన్సీడీ క్లినిక్ లను సందర్శించి రక్తపోటు మరియు డయాబెటిస్ రోగులకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ప్రతి నెల వారికి మందుల పంపిణీ రికార్డు పరిశీలించారు. అక్కడికి వచ్చిన రోగులను వారికి అందుతున్న సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని లేబర్ రూమ్ లను సందర్శించి, వారు మాట్లాడుతూ..జిల్లా కలెక్టర్ యొక్క సూచనల మేరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటి కానుపు లన్నీ గవర్నమెంట్ నార్మల్ డెలివరీల కొరకు ప్రోత్సహించి, సిజేరియన్ డెలివరీల పర్సంటేజీ తగ్గించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని నార్మల్ డెలివరీలను పెంచాలన్నారు. అదేవిధంగా అవుట్ రీచ్ కేంద్రాలలో ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులు నిర్వహించి మహిళలందరికీ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ స్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ వరుణ,డాక్టర్ సుచిత్ర మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.