Listen to this article

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు డా.మొగుళ్ళ భద్రయ్య.. జగిత్యాల:

జనం న్యూస్ ఎప్రిల్ 28 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండల జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల అధ్యక్షులు గా చీర్నవేని శ్రీనువాస్ మండల ప్రాదన కార్యదర్శి గా చిక్రం మారుతి ఉపాధ్యక్షులు గా గంగదరి పూర్ణచందర్ గౌడ్ ఫ్రచార కర్యధర్శి గా రామకీష్టు గంగాధర్ కోశాధికారి యుయ్యాల కిషన్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ సమక్షంలో బీరుపూర్ మండల కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు. నియామన సమయంలో, మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి, ప్రజల్లో హక్కుల పట్ల అవగాహన పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని నూతన మండల అధ్యక్షులు ను కోరారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి కోలా రాజేశం గౌడ్, జగిత్యాల రూరల్ ప్రధాన కార్యదర్శి మ్యాన్ మధు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితుడైన చీర్నవేని శ్రీనువాస్ మాట్లాడుతూ,మానవ హక్కుల పరిరక్షణ నా ప్రధాన లక్ష్యం. మండల వ్యాప్తంగా ప్రజల్లో మానవ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ, హక్కులు దెబ్బతినకుండా కృషి చేస్తాను. కమిటీ నన్ను ఈ బాధ్యతకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.