

మద్నూర్ తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడి_
మద్నూర్ ఏప్రిల్ 28 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
ఈనెల 29వ తేదీన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టం 2025 – కల్పిస్తున్న హక్కులపై రైతులకు అవగాహన కోసం సదస్సు ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ , స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అదే విధంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ముఖ్య అతిథులుగా వస్తున్నట్లు తెలిపారు ఈ సదస్సుకు మండల రైతులు వచ్చి చట్టంను అవగాహన చేసుకోవాలని తహసిల్దార్ కోరారు.