Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈస్ గాం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి బషీరుద్దీన్ తేది 17.11.2024 న గుండెపోటుతో మరణించగా ఆయన సతీమణి గోరి బేగం కు భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- రూపాయల చెక్కు ను సోమవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్., జిల్లా పోలీస్ కార్యాలయం లో వారి కుటుంబంనికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి, ఆర్.ఐ లు పెద్దన్న, అంజన్న, నాగుల్ మీరా, జిల్లా పోలీసు కార్యాలయ ఎ.ఓ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వర్మ లు పాల్గొన్నారు.