

జనం న్యూస్ 29 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి)
భీమారం మండల కేంద్రంలో ఏప్రిల్ 29 ప్రజావాణిలో ఇందిరమ్మ కమిటీ భోగస్ అని ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికే ప్రాధాన్యత చేస్తున్నారని, కమిటీలు వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోట రవి, అనపర్తి దేవదాస్, సోను కోట రాజేశం, డిమాండ్ చేశారు కమిటీ ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతుండగా ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రోజున కమిటీని నిలదీశారు, ఇతర పార్టీల నుండి వచ్చిన వారు ఉన్నారని కమిటీని రద్దు చేయాలని లబ్ధిదారుల పేర్లు తీసివేస్తున్నారని అర్హుల పేర్లు తొలగించడం ఎందుకని ప్రశ్నించారు,
