Listen to this article

జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంలోని పూల్‌ భాగ్‌లో నక్కాన పైడిరాజు ఇంట్లో ఈ నెల 23న జరిగిన బంగారం చోరీ కేసును 2వ పట్టణ పోలీసులు సోమవారం ఛేదించారు. పైడిరాజు దగ్గర బంధువైన నక్కాన కుమారిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితుడు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేశామని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. రాజీవ్‌ క్రీడామైదానం సమీపంలోని కుమారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరం ఒప్పుకుందన్నారు. పదకొండున్నర తులాల ఆభరణాలను ఆమె నుంచి రికవరీ చేశామన్నారు