Listen to this article

జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

అవును భారత్ లోని కొందరు ముస్లిమ్ లకు భయం మొదలయింది! పహల్గాంలో ఉగ్రవాదులు మీరు హిందువులా? అని అడిగి చంపడంతో భారత్ లో మత విభేదాలకి తెరలేపినట్లయింది.ముస్లిమ్ల వద్ద వస్తువులు కొనొద్దు. ముస్లిమ్ల వద్ద ఏమీ తినొద్దు. ముస్లింలను అసలు నమ్మొద్దులాంటిప్రచారాలెక్కువయ్యాయి!
ఈ పరిణామంతో కొందరు ముస్లిమ్ లకు భవిష్యత్తులో ఈ దేశంలో బ్రతకగలమా అన్న భయం పట్టుకుంది. పదినిమిషాలు పోలీసులు, ప్రభుత్వం పక్కకు తప్పుకుంటే, భారత్ లోని హిందువులను చీల్చిచెండాడుతామని గతంలో ప్రగల్భాలు పలికిన ‘ఒవైసీ’ ఈరోజున పాకిస్తాన్ ఉగ్రవాద చర్యని ఖండిస్తున్నాడు. అతనిలో వచ్చిన మార్పుకి కారణం ‘భయం’ అని తెలుస్తోంది? మన సెక్యులర్ ప్రభుత్వం అన్ని మతాలవారినీ సురక్షితంగా బ్రతకనిస్తుంది! అయినా కొన్నిచోట్ల ఎప్పుడు మతఘర్షణ లొస్తాయోనన్న భయంతో కొందరు ముస్లిములు గుంపులుగా వలసపోతున్నారు. విజయనగరంలో సంచరిస్తున్న అలాంటి
ఓ గుంపుని నేను ప్రశ్నించాను. వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుండి ఆదివారం ఒక్కరోజు కోసం ఉంగరాలమ్మడానికి వచ్చామన్నారు. మీరు హిందువులా ముస్లిములా అని అడిగాను. భయంతో అందరూ దువులమన్నారు.వాళ్ళు చెబుతున్నది అబద్దమని నాకు అర్ధమయింది. ముస్లిములు మాకు సోదరులే. హిందువులైనా ముస్లింలైనా ఈ దేశంలో అందరం భారతీయులమే. భయపడకండన్నాను. వాళ్ళకి (పైన చూపిన) ఫొటో తీసాను. అంతలో అటుగా వచ్చిన ఓ పోలీసు అధికారి వాళ్ళని వివరాలడుగుతున్నారు.నేను వాళ్ళతో హిందీలో మాట్లాడి ఆయనకు తెలుగులో తెలియజేసాను. ఆదివారం నాడు వన్ టౌనులో వాళ్ళ ఆధార్ కార్డులు ఇచ్చి, వేలిముద్రలు వేసాము. ఒక్కరోజు కోసమే ఇక్కడికి వచ్చాము. ఈరోజు వెళ్ళిపోతున్నామన్నారు. ఇలాంటి వలస గుంపులు మతఘర్షణలకు ఆష్కారమున్న ఉత్తర భారత్ లో కొన్ని చోట్ల వుండలేక ఇటుగా వస్తున్నారనిపిస్తోంది! బంగ్లాదేశ్ చొరబాటుదార్లు కూడా ఇలా దేశమంతటా విస్తరిస్తున్నారనిపిస్తోంది. ముస్లిములంతా తీవ్రవాదులనే భ్రమ పడకుండా దేశం కోసం, దేశప్రజలందరి కోసం అన్ని మతాలవారము ఈ దేశపౌరులం! ముందుగా అందరం భారతీయులం అనే సంకల్పంతో జీవిద్దాం!
ఈ కల్లోల పరిస్థితి లో ప్రతి మనిషి ఒక సైనికుడిలా కదలి, అప్రమత్తంగా వుంటూ ప్రభుత్వానికి సహకరిద్దాం!!