

జనం న్యూస్ ఏప్రిల్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
దాసరి శ్రీనివాసరావు, ప్రసన్న జ్ఞాపకార్థంగా, కె.పి.హెచ్.బి లోని భాగ్యనగర్ కాలనీలో రాహుల్ దాసరి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోల్డ్ మాన్గా కొండా విజయ్ ముఖ్య అతిథిగా హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా విజయ్ మాట్లాడుతూ, వేసవి తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా మజ్జిగ పంపిణీ చేయడం అనేది అభినందనీయమని, రాహుల్ దాసరి టీంకు తెలిపారు. మరెన్నో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని వారిని ప్రోత్సహించారు. ఈ వేసవి కాలం మొత్తం పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దయాసాగర్, శ్రీనివాస్ యాదవ్, హరికుమార్, హరికృష్ణ, సతీష్ నాయుడు, బుల్లెట్ రవి, రవీందర్, రాకేష్, అర్జున్ తదితరులు