

జనం న్యూస్ ఏప్రిల్ 29:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండల కేంద్రం: మంగళవారం రోజునా వర్షకొండ రోడ్డులోని తీగల వాగు సమీపంలో ఎస్సై బి రాము తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సిపి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయబడుతుందని అంతేకాకుండా హెల్మెట్ లేకుండామరియు వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై తెలిపారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ శివయ్య కానిస్టేబుల్ సుమన్ కిషోర్ తదితరులు ఉన్నారు.