

జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం, కనగర్తి గ్రామంలో బుధవారం నాడు బాలుడు పై వీధి కుక్క దాడి చేశినా ఘటనలో, తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామంచ అయాన్ అనే రెండు సంవత్సరాల బాలుడు, ఇంటి ముందు వరండాలో ఆడుకుంటుండగా ఒక పిచ్చి కుక్క,, ఒక్క సారిగా బలుడి పై దాడి చేసింది అన్నారు. దీంతో బాలుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. గ్రామ ఫరిధిలో ఇటీవల కూడా ఇద్దరు పిల్లలపై వీధి పిచ్చి కుక్కలు దాడి చేయడం జరిగిందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే చొరవ తీసుకొని వీధి పిచ్చి కుక్కల సమస్యకి పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేసారు.
