

జనం న్యూస్, ఏప్రిల్30
అచ్యుతాపురం:జనసేన లో చేరికలు భారీగా పెరిగిపోయాయి. మల్లవరం,ఉప్పవరం, నరంద్రపురం,అచ్యుతాపురం, తిమ్మరాజుపేట, చెర్లోపాలెం గ్రామాలకు చెందిన సుమారు 200 మందితో సర్పంచ్లు పిన్నమరాజు వాసు,సకల ఉమా మహేశ్వరి,చిన్ని శ్రీనివాసుతో పాటు శ్రీను,శివ,నాగు,గౌతమ్,ప్రకాష్ రావు,బాబ్జి,టీంకు వైసీపీ పార్టీ వైఖరి నచ్చిక వైసీపీని వీడి రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కండువాలు వేసి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోరుపోలు చిన్నారావు,జనపరెడ్డి శ్రీను తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.