Listen to this article

హుజురాబాద్ ఆర్డీవోకు రమేష్ కి వినతి పత్రం,


జమ్మికుంట మాజీ జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్..

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అసలైన నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి ఇండ్లు కేటాయించాలని ఆర్డీవోకి కోరడం జరిగింది అన్నారు.. హుజురాబాద్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం ప్రభుత్వం సర్వే నిర్వహించి, నిరుపేదల కుటుంబాలకు ఇండ్లను, కేటాయించాలని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ఇండ్లను కేటాయించాలని, గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లు, హుజురాబాద్ నియోజకవర్గం లో నిర్మించినప్పటికీ కూడా, వాటి పంపిణీ జరగలేదని ఈ సందర్భంగా తెలియజేసారు.గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టినటువంటి డబల్ బెడ్రూములు నిరుపయోగంగా ఉంటున్నాయని, వారు సూచించారు. దీని మూలంగా నిరుపేద కుటుంబాలు కిరాయి ఇండ్లలో జీవనం కొనసాగిస్తూ, అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారికి సందర్భంగా వాపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అవక తవకలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులదని వారు సందర్భంగా పేర్కొన్నారు. అధికారులు పారదర్శకత వ్యవహరించాలని వారు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా వివిధ గ్రామాలలో ప్రారంభించాలని ఆర్డీవోను కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు యాంశని శశిధర్, రాజమౌళి,రాజు, పాల్గొన్నారు.