Listen to this article

జనం న్యూస్ 01 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు డీసీసీబీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. బుధవారం విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కష్టపడి పని చేసే నాయకులకు, కార్యకర్తలకు తెదేపాలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.