Listen to this article

జనం న్యూస్ 01 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన వివరా లను తమ ముందు ఉంచాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఉపాధి పథకంలో గ్రామసభలు తీర్మానించిన పనులకే పరి పాలన అనుమతులు ఇచ్చారా? లేక ఎమ్మెల్యే సిఫారసఉ మేరకు నడుచుకు న్నారా? అని అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ను ఆరా తీసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీర జ్‌సింగ్‌ ఠాకూర్‌ జస్టిస్‌ చీమలపాటిరవితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదే శాలు ఇచ్చింది. విజయనగరం మండలంలో ఉపాధి హామీ పనుల విషయంలో గ్రామసభలు చేసిన తీర్మానాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేసిన సిఫార్సులకు కలెక్టర్‌ పరిపాలన అనుమతులు ఇచ్చారంటూ విజయనగరం జిల్లాకు చెందిన లోకల్‌ గవర్నమెంట్స్‌ చాంబర్‌ అధ్యక్షుడు ఎం.అప్పలనాయుడు హైకోర్సులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది వడ్లమూడి కిరణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తా ఉపాధి హామీ పథ కంలో గ్రామసభలు చేసిన తీర్మానాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యే నిఫారసు చేసిన పను లకు కలెక్టర్‌ పరిపాలన అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇలా చేయడం ఉపాధి చట్టం నిబంధనలకు విరుద్ధమన్నారు. అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపిస్తూ గ్రామసభ చేసిన తీర్మానానికి అనుగుణంగానే కలె క్టర్‌ పరిపాలన అనుమతులు ఇచ్చారని తెలిపారు. గతేడాదే పనులు ప్రారంభమ య్యాయని, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు.