

బీఎస్పీ భారత రాజ్యాంగాన్ని పకడ్బందీగా అనుసరిస్తుంది.
రాజ్యాంగ పరిధిలో బ్యాలెట్ రాజకీయాలతో బహుజన రాజ్యాధికార సాధనకై గుర్రాల విజయ్ కృషి చేస్తాడు.
గుర్రాల విజయ్ కుటుంబాలకు బీఎస్పీ పార్టీ అండగా ఉంటుంది.
తడికల శివ కుమార్ బీఎస్పీ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు.
జనం న్యూస్ 01 మే (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్లా శంకర్)
చర్ల మండల కేంద్రం లోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం గురువారం చర్ల మండల అధ్యక్షుడు కొండా కౌశిక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ సమక్షంలో గుర్రాల విజయ్ పార్టీ లో చేరడం జరిగింది.ముందుగా తడికల శివకుమార్ గుర్రాల విజయ్ కి బీఎస్పీ పార్టీ కండువా కప్పి విజయ్ నీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గుర్రాల విజయ్ బీఎస్పీలోకి రావడం ఎంతో శుభ పరిణామం అని అన్నారు. బి ఎస్ పి ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందని భారత రాజ్యాంగాన్ని అత్యంత పకడ్బందీగా అనుసరిస్తుందని తెలిపారు. బ్యాలెట్ రాజకీయాల ద్వారా బహుజన జాతులకు అధికారం తీసుకురావచ్చు అని నమ్మి బహుజన ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్న విజయ్ కి బీఎస్పీ సగర్వంగా స్వాగతం పలుకుతుందని తెలిపారు. సామాజిక పరివర్తన ఉద్యమనికి తను చేసే కృషి తోడ్పడుతుందని అన్నారు. పార్టీని పార్టీ నాయకత్వాన్ని నమ్మి బీఎస్పీ లోకి వచ్చినందుకు విజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ విజయ్ కుటుంబానికి నిరంతరం అండగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా చరణ్, భద్రాచలం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్, చర్ల మండల బీఎస్పీ ఉపాధ్యక్షులు చెన్న0 మోహన్, చర్ల మండల ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేష్,పార్టీ మండల నాయకులు అయినవోలు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.