Listen to this article

జనం న్యూస్ 01 మే (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )

శరీర రుగ్మతలతో హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న
కొత్తగూడెం మాజీ జడ్పీటీసీ సభ్యులు, రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ జనరల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు , బాల్య పాఠశాల స్నేహితులు గిడ్ల పరంజ్యోతి రావు ను సందర్శించి, పరామర్శించి, వారికి మనోధైర్యం కలిగించి, ఓదార్చి, ఆదరించిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, గిడ్ల
పరంజ్యోతి రావు త్వరగా కోలుకోవాలని వారి చికిత్స విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంతో ఆర్ధతతో ఆసుపత్రి యాజమాన్యాలకు ఫోన్ చేసి, అన్ని రకాల అభయాలను ఇచ్చి ఎంతో శ్రద్ధ కనబరిచిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కి మరియు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కి,హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు మరి ముఖ్యముగా సింగరేణి మెయిన్ హాస్పిటల్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఐసీయూ ముఖ్య వైద్యులు శ్రీ డాక్టర్ ఆనంద్ సుధాకర్
నర్సులు ఆయాలు వార్డుబాయలు అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిదని డాక్టర్ఆచార్య డాక్టర్ మద్దెల, పరంజ్యోతి రావు త్వరగా కోలుకునేలా విజయవంతమైన చికిత్స అందిస్తూ, విశిష్టమైన సేవలను అందిస్తున్న డాక్టర్లకు, నర్సులకు ఆయాలకు వార్డ్ బాయ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర నాయకులు గొల్లపల్లి దయానందు పాల్గొన్నారు