

దర్శికి చెందిన “అంజిరెడ్డి”, గిద్దలూరు కు చెందిన “వేమిరెడ్డి రామచంద్రారెడ్డి”
జనం న్యూస్, మే 01, (ఏపీ స్టేట్ బ్యూరో):
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరిని పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీ జనరల్ సెక్రటరీగా దర్శికి చెందిన కుమ్మిత అంజిరెడ్డి, సెక్రటరీగా గిద్దలూరుకు చెందిన వేమిరెడ్డి రామచంద్రారెడ్డి ని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి కి అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి, గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుందురు నాగార్జున రెడ్డి కి “వేమిరెడ్డి” రామచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.