Listen to this article

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ )

జనం న్యూస్ మే1, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోని వేములకుర్తి గ్రామంలో ఈనెల 4వ తేదీ ఆదివారం రత్నాలమడుగు శివాలయం ప్రారంభోత్సవం మరియు నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాల్సిందిగా ఆర్మూర్ డివిజన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుడ్ల రామకృష్ణని వేములకుర్తి గ్రామస్తులు ఆహ్వానించడం జరిగింది, ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల రెండవ తారీకు ప్రారంభమై 4వ తారీకు ముగుస్తుందని తెలిపారు, నాలుగో తేదీ ఆదివారం రోజున ఉదయం 9 గంటల 48 నిమిషాలకు చక్రపాణి నరసింహమూర్తి వారి ఆధ్వర్యంలో ఇట్టి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని ఇట్టి కార్యక్రమానికి సతీసమేతంగా రావాలని ఆర్మూర్ డివిజన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణని ఆహ్వానించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో రత్నాలమడుగు శివాలయం నిర్మాణ కమిటీ చైర్మన్ ఎడిపల్లి గంగారెడ్డి, పుప్పాల నరేందర్, లక్ష్మణ్, దేవేందర్, అంకతి రాజన్న పాల్గొన్నారు,