

జనం న్యూస్ మే 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మాలపేట గ్రామం లో మే డే సందర్భంగా తాపీ మేస్త్రి సంఘం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మివారం జరిగిన వైద్య శిబిరం కార్యక్రమాన్ని జిల్లా కమిషనర్ ఆఫ్ లేబర్ (DCL ) వసంతరావు ప్రారంభించారు. సుమారు 80మంది కార్మిక కుటుంబాలు డాక్టర్ అరుణ పరీక్షలు చేశారు. కార్యక్రమం లో శంకర్ ఫౌండేషన్ సభ్యులు పూసర్ల రాజా, కార్మిక సంఘం అధ్యక్షులు చీర అప్పలరాజు,కార్యదర్శి మారేడి పూడి సత్యనారాయణ, నాయకులు గుమ్మాలనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.