

జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
అభివృద్ధిలో అసలైన భాగస్వాములు శ్రామికులని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు శాయంపేట మండల కేంద్రం లో అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు మారపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిరుపేద కార్మికులకు పండ్లు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దుదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ లాభాలే ధ్యేయంగా అతి తక్కువ వ్యయంతో కార్మికులను వెట్టి చాకిరి చేయిస్తున్న యాజమాన్యంపై పోరాటాలు చేసి రోజువారి పని దినాన్ని 8 గంటలకు అమల్లోకి తెచ్చి న ఘనత కార్మికుల ఐక్యతకు నిదర్శనం కార్మికుల కర్షక రైతు కూలీలకు అండగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల కు పెంచిన దినసరి కూలి 300 రూపాయలను వెంటనే అమలులోకి వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి, దుబాస్ కృష్ణమూర్తి మారేపల్లి రాజు కట్టయ్య బాసని రవి బాసాని మార్కండేయ ప్రపంచ రెడ్డి అక్కపాక రాజు రాము పరమేశ్వర్ రమేష్ కోల శీను వీరన్న తదితరులు పాల్గొన్నారు….