

బిచ్కుంద మే 1 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
ఈ రోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా శ్రీ. జాడ వినీల్ కుమార్ గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దీంతో న్యాయవాదులు జడ్జి గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద న్యాయవాదులు, కోర్టు సిబ్బందిలు పాల్గొన్నారు, న్యాయవాదుల అధ్యక్షులు ఎ.ప్రకాష్ పటేల్, జనరల్ సెక్రటరీ ఈ.శివాజీ, ఉప అధ్యక్షులు ఆర్.బి దేశముఖ్, ట్రెజరరీ టి. విట్టల్, న్యాయవాదులు జి.మల్లేశ్వర్, షేఖ్ మొహమ్మద్, ఎ.పురుషోత్తం, ఆర్. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.