

జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ శివ మార్కండేయ స్వామి ఆలయంలో శ్రీ ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం రెండో రోజు ప్రారంభం భద్రకాళి దేవస్థానం అర్చకులు గణేష్ ఆత్రేయ శర్మ, దుర్గాసాయి శర్మ. ప్రద్యుమ్న శర్మ, అచ్యుత్ శర్మ, సాయి ప్రణీత్ శర్మ. సాయి రాజేష్ శర్మ. దుర్గా ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, అగ్ని స్థాపన, జేరీతాడనం. ధ్వజారోహణం, మండల దేవతపూజానం ఎదుర్కోలు కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటి చైర్మన్ బాసాని సూర్యప్రకాష్ పద్మ. తెలంగాణ రాష్ట్ర మినిమం వేజేస్ అడ్వైజరీ మెంబర్ బాసాని చంద్రప్రకాష్, బాసాని విశ్వప్రకాష్ శోభ బాసాని జయప్రకాష్, ఆలయ అర్చకులు మార్త రాజుకుమార్ తాటి రమేష్, చిందం కర్ణాకర్, గ్రామస్థులు బాసాని వెంకటేశ్వర్లు బాసాని లక్ష్మీనారాయణ బాసాని సదాశివుడు. చంద్రమౌళి బాసాని రమేష్ భక్తులు పాల్గొన్నారు….