

జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం పట్టణం మహిళా పోలీసు స్టేషనులో 2022 సంవత్సరంలో నమోదైన అత్యాచారం, నమ్మించి
మోసగించిన కేసులో నిందితుడైన రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన టంకాల శంకరరావుకు విజయనగరం 5వ ఎడిజె మరియు మహిళా కోర్టు జడ్జి శ్రీమతి ఎన్.పద్మావతి గారు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.10,000/-లు జరిమానా విధిస్తూ మే 1న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ నర్సింగరావు తెలిపారు. రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన నిందితుడు టంకాల శంకరరావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఒక ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఆమెపై అత్యాచారంకు పాల్పడినట్లు, పెళ్ళికి నిరాకరించడంతో విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2022 సం.లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ కె.టి.ఆర్. లక్ష్మి కేసు నమోదు చేసారు. అప్పటి మహిళా పిఎస్ ఇన్స్పెట్టరు ఎం.శేషు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను
త్వరతిగతినపూర్తి చేసి నిందితుడికి శిక్షపడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నిందితుడు టంకాల శంకరరావు ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లుగా నేరం రుజువు కావడంతో 5వ ఎడిజె మరియు మహిళా కోర్టు న్యాయమూర్తి ఎన్.పద్మావతి గారు నిందితుడు టంకాల శంకరరావుకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 10,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసు వారి తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎన్. శకుంతల వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబుల్ జి.సూరపునాయుడు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పర్చారని విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ నర్సింగరావు తెలిపారు.