

జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడీపల్లి గ్రామానికి చెందిన , గిరబోయిన బిక్షపతి, తండ్రి సమ్మయ్య అనే కౌలు రైతు అప్పుల బాధతో 17-5 -2016, నాడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కారణం భూమిని కౌలు తీసుకొని పత్తి పంటల సాగు చేసాడు. పంట దిగుబడి రాకపోవడం వలన 4 లక్షల వరకు అప్పులు కాగా,
తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇతనికి ఇద్దరు పిల్లలు, కూతురు, కొడుకు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక తరఫున పరామర్శించారు. తదనంతరం, రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా ఆ సంస్థ ద్వారా రూ.40,000/-లు ఆర్థిక సహాయంతో గొర్రెలు కొని ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు కన్నూరి సదానందం, రాచపల్లి సమ్మయ్య , ఇంజం చైతన్య సమన్వయ కర్తలుగా వ్యవహరించగా, ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న-సదానందం, డైరెక్టర్ ఎగ్గెటి సదానందం, కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్నవేన రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎగ్గేటి కుమారస్వామి, అంబాల రాజు, మ్యాకమల్ల అశోక్, మంగ అశోక్ రామిడి సూర్య తేజరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక, తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు, ప్రభుత్వ ప్రవేశపెట్టిన 194 జిఓల ద్వారా రైతు ఆత్మహత్య కుటుంబాలకు రూ.6,00,000/-లు, నష్టపరిహారం చెల్లించాలని , అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని, వారు ప్రభుత్వాన్ని కోరారు. రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ, కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.