Listen to this article

యువకులు లైసెన్స్ లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు

దొంగల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు

ఎస్సై ప్రవీణ్ కుమార్

జనం న్యూస్ మే 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన ప్రయాణించే వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ కోరారు.శుక్రవారం పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో రైతులు పశువులను విడిచిపెట్టడం వల్ల రోడ్లపైకి వచ్చి రాత్రి వేళలో రోడ్డుపైనే పశువులు పడుకోవడం,రోడ్డు క్రాస్ చేయడం జరుగుతుందని, వివిధ గ్రామాల నుండి దూర ప్రాంతాల నుంచి చిన్న పెద్ద వాహనాలపై వెళ్లే వాహనదారులు,జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకుంటూ పోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా మితిమీరిన వేగం రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలపటం నిద్రమత్తులో వాహనాలు నడపటం వల్ల, ప్రమాదాలు ఎక్కువగా జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, కొంతమంది యువకులు లైసెన్స్ లేకుండా త్రిబుల్ రైడింగ్ నలుగురు ఇద్దరు చొప్పున మద్యం సేవించి రోడ్ల పైన విచ్చలవిడిగా,వాహనాలు నడుపుతున్నారని,వారి పట్ల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు జాగ్రత్తగా వహించాలని సూచించారు.పిల్లలకు వాహనాలు ఇచ్చి ఇబ్బంది పడవద్దని కోరారు.దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా గ్రామాలలో కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. గ్రామాల్లో పిల్లలను తల్లిదండ్రులు ఈతకు చెరువులు,కుంటలు, బావుల దగ్గరకు పంపించొద్దని పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ కనిపించిన,మైనర్లకు వాహనాలు ఇచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.