Listen to this article


జనం న్యూస్ మే 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి

రవి శాయంపేట మండలం ప్రజా ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.పద్మశాలీలు అన్ని రంగాలలో రాణించాలని, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టిఆర్పిఎస్) శాయంపేట మండల అధ్యక్షుడు సామల మధుసూదన్ అధ్యక్షతన మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలి, మలి దశ పోరాటాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, అన్నారు ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. మండల కేంద్రంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజేస్ అడ్వైజరీ మెంబర్ బాసాని చంద్రప్రకాష్ మాజీ సర్పంచ్ కందకట్ల రవి అధిక సంఖ్యలో వివిధ గ్రామాల నుండి పద్మశాలి కుల పెద్దలు పాల్గొన్నారు……