

జనం న్యూస్ మే 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం సిడిపిఓ మేడమ్ ఐ. విమల వారి ఆధ్వర్యంలో పల్లంకుర్రు అంగన్వాడీ సెంటర్ నందు పల్లంకుర్రు సచివాలయంకు సంబంధించిన కిశోరి బాలికలకు “కిశోరి వికాసం” వేసవి శిక్షణా కార్యక్రమాల ప్రణాళిక ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది.సూపర్వైజర్ కుమారి లంకే వెంకట రమణి కిశోరి బాలికలకు పౌష్టికాహారం ప్రాముఖ్యత గురించి, విద్య యొక్క ప్రాముఖ్యత గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, బాల్య వివాహాలు చేసుకుంటే జరిగే దుష్ప్రభావాలు గురించి విపులం గా వివరించటమైనది. కార్యక్రమానికి సర్పంచ్ , సెక్రటరీ , హెల్త్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, అత్యధిక సంఖ్యలో కిశోరి బాలికలు హాజరైనారు.కిశోరి వికాసం కొరకు ర్యాలీ నిర్వహించటమైనది.
