Listen to this article

(జనం న్యూస్ మే 2 చంటి)

ఈరోజు మండల వనరుల కేంద్రం దౌల్తాబాద్ నందు మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు గారికి మండల వనరుల కేంద్రం సిబ్బంది ఘన సన్మానం చేయడం జరిగింది . దౌల్తాబాద్ మండలాన్ని పదవ తరగతి ఫలితాలలో నాలుగవ స్థానం సాధించినందుకు అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిర్మలాపూర్ లో పదవ తరగతి ఫలితాలు శతశాతం సాధించినందుకు గాను సన్మానం చేయడం జరిగింది మండలంలోని అన్ని పాఠశాలల ఫలితాలను బట్టి మండల విద్యాధికారి హర్షనీయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో MIS కోఆర్డినేటర్ ఏ.శేఖర్ సి సి ఓ పెంటయ్య సిఆర్పిలు రాజు కుమార్ నగేష్ చంద్రమౌళి మల్లేశం పాల్గొన్నారు.