

జనం న్యూస్ మే 03 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం 4లో విలేజ్ హెల్త్ స్యనిటేషన్ న్యూట్రిషన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు పిల్లలో బరువు పెరుగుదల పర్యవేక్షణ గురించి 0నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు, బాలింతలకు పోషికాహారం గురించి అవగాహన కల్పించారు. ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ గర్భిణి, బాలింతలు, పిల్లలకు పోషకాహారం గురించి మరియు పరిసరాల పరిశుభ్రత గురించి ఇమ్యూన్తెజేషన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిసి సూపర్వైజర్ సరిత, ఏఎన్ఎం,పంచాయతీ కార్యదర్శి,రిటైర్డ్ ఉపాధ్యాయుడు మొహినుద్దీన్,అంగన్వాడీ టీచర్ సంధ్యారాణి, ఆయా రేష్మ, ఆశా వర్కర్ వనజ,గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
