Listen to this article

జనం న్యూస్ // మే // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

జమ్మికుంట మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినందుకు గాను మున్సిపల్ సెక్రటరీ టి. కే. శ్రీదేవి ఐఏఎస్, మూడు కోట్ల నిధుల ప్రొసీడింగ్ అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సెక్రటరీ శ్రీదేవి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూళ్లలో 100% ,వసులు చేసి, మొదటి స్థానం సాధించినందుకు గాను, జమ్మికుంట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది అన్నారు. పట్టణ అభివృద్ధికై, మూడు కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ కు అందజేసినట్లు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మార్చి నెలకు ముందుగానే పన్ను వసూళ్లు పూర్తి చేయాలని కమిషనర్ అయాజ్ ను, సిబ్బందిని ఆదేశించారు. పన్ను వసూళ్లలో కష్టించి పని చేసిన మున్సిపల్ సిబ్బందిని మున్సిపల్ సెక్రటరీ శ్రీదేవి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ.. మూడు కోట్ల నిధులు పట్టణంలోని జంక్షన్ లతో మున్సిపాలిటి ఆదాయం సమకూర్చే వాటికి, అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్.ఐ. భాస్కర్, ఆర్.ఓ వాణి, మున్సిపల్ అధికారులు మహేష్, బిల్ కలెక్టర్ మొగిలయ్య, పాషా, కుమార్ లతో పాటు పలువురు పాల్గొన్నారు